భారతీయ పురాణ, ఇతిహాసాల విశేషాలను కళ్ల ముందుంచే సంపూర్ణ ఆధ్యాత్మిక, పౌరాణిక సందర్శనా స్థలం కుందా సత్యనారాయణ కళా ధామం. భారతదేశంలో మొట్టమొదటి ఆధ్యాత్మిక కళా ధామమైన ఈ అద్భుత నిర్మాణం భారతదేశ పౌరాణిక, సాంస్కృతిక, సంప్రదాయాల ఘన వారసత్వాన్ని సందర్శకులకు పరిచయం చేస్తుంది.

3 కిలో మీటర్ల పరిధిలో విశాలంగా నిర్మించిన ఈ కళా ధామాన్ని నడక మార్గంలో వెళుతూ సందర్శించాలి. రామాయణం, మహా భారతం, భాగవతం, బుద్ధుడి జీవితం.. ఇలా ఎన్నో పౌరాణిక గాథల్లోని ప్రముఖ ఘట్టాలను ప్రతిబింబించే అందమైన శిల్పాలు, విగ్రహాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ఇక్కడ పున:సృష్టించిన చారిత్రక ఆలయాల నమూనాలు అసలు దేవాలయాల నిర్మాణ శైలి, ఆకర్షణలు అసలు దేవాలయాలకు ఏమాత్రం తీసిపోవు. ఈ దేవాలయాల దర్శనం సందర్శకులకు అంతులేని ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది.

సందర్శన వేళలు

ప్రవేశ సమయం:
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు (ప్రతి రోజూ)

సందర్శన వేళలు:
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు (ప్రతి రోజూ)

ప్రవేశ రుసుము

పెద్దలకు : రూ.350
పిల్లలకు : రూ.300
(5 ఏళ్ల లోపువారికి ఎలాంటి రుసుము లేదు)

మరిన్ని వీక్షించండి